మోసగాళ్ల ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సైబర్ మోసగాళ్లు అమాయకుల ఖాతాలు కొల్లగొట్టేందుకు ఏ దారి వదలట్లేదు. ‘4G నుంచి 5Gకి మారండి అంటూ ఫోన్కి మెసేజ్ లేదా లింక్ వచ్చిందా..? తొందరడి క్లిక్ చేయకండి’ అని సైబర్ పోలీసులు హెచ్చిరిస్తున్నారు. ఇదే అదనుగా తీసుకొని సైబర్ కేటుగాళ్లు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారట. 5G సర్వీస్ల పేరిట అందినంతా దండుకొని ఉడాయిస్తారని తెలిపారు. మోసాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.