సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ గ్రూప్ లు

.. చోద్యం చూస్తున్న పోలీసు శాఖ ...వాట్సప్ గ్రూప్ ల పై కొరవడిన నిఘా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ గ్రూపులో జోరుగా సాగుతున్నాయి. ఐపీఎల్ ,లూడో ,స్నేక్ లాడర్ పలు రకాల ఆన్లైన్ గేమ్ల పేరిట సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ గ్రూపులను కొంతమంది యువకులు జోరుగా నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ గ్రూపుల ద్వారా బెట్టింగులు భారీగా పెట్టి రోడ్డున పడ్డ కుటుంబాలు సైతం ఎన్నో లేకపోలేదు. కొంతమంది యువకులు ఏకంగా తమ ప్రాణాలు సైతం తీసుకున్నారు. ఇంత జరుగుతున్న పోలీసు అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు .ఎప్పటికప్పుడు వాట్సప్ గ్రూపులపై నిగా పెట్టాల్సిన పోలీసు అధికారులు వాటిపై నిఘా కొరవడంతో యదేచ్చగా యువకులు బెట్టింగ్ గ్రూపులను నిర్వహించడంతోపాటు ఏకంగా వాటి లింకులను సైతం సమూహాలలో షేర్ చేయడం గమనార్హం ఇప్పటికైనా రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నత శాఖ అధికారులు బెట్టింగ్ గ్రూపు లపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.