భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ – నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ , నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఏడాది‌ కాలం పాటు సేవలందించనున్నారు.

2015 నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత సేవలందిస్తూ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరిగేలా కృషి చేస్తాన‌ని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.