నేడు హైదరాబాద్ లోకి ప్రవేశించనున్న భారత్ యాత్ర
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మంగళవారం ఏడవ రోజూ భారత్ జూడో యాత్ర శంషాబాద్ నుంచి మొదలైన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించనుంది. ఈ యాత్ర ఉదయం ఆరాంఘర్ మీదుగా పురాణాపూల్ చేరుకోనున్న యాత్ర సాయంత్రం పురానాపూల్ నుంచి చార్మినార్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటుంది. అనంతరం రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తంభంపై జాతీయ పతాకాన్ని రాహుల్ ఆవిష్కరిస్తారు. సాయంత్రం రాహుల్ తో పాటు జోడో యాత్రలో పాల్గొననున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రాత్రి 7గంటలకు నెక్లెస్ రోడ్ లో కార్నర్ లో సమావేశమై అనంతరం బోయిన్ పల్లి లోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లో రాహుల్ గాందీ బస చేయనున్నారు.