భవ్యశ్రీ హంతకులను ఎంకౌంటర్ చేయ్యాలి

భారత్ సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు కుమారి యామినీ లక్ష్మీడిమాండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భవ్యశ్రీ హంతకులను ఎన్కౌంటర్ చేయ్యాలని భారత్ సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు కుమారి యామినీ లక్ష్మీ డిమాండ్ చేసారు. నేడిక్కడ మీడియా సమావేశం లో ఆమె మాట్లాడుతూ గన్ కంటే ముందు జగన్ ఉంటాడు.. అన్నారు.. మరి ఏపి లో  ఇంతమంది ఆడపిల్లలు, మహిళలు దారుణంగా రేప్, మర్డర్ లు జరిగి చనిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చేస్తుంది.. పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందని ఆమె ప్రశ్నించారు. గతవారం వినాయక చవితి రోజు చిత్తూరు జిల్లా, పెనుమురు దగ్గర ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం భవ్యశ్రీ అనే 17 ఏళ్ళ ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిని నలుగురు యువకులు నాలుగు రోజులపాటు ఆ అమ్మాయిని అతి దారుణంగా చిత్ర హింసలు పెట్టి చంపి ఒక గోతి లో పడేసారని పేర్కొన్నారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిందితులను ఎన్కౌంటర్ చేయ్యాలని.. ఈ దుశ్చర్యను ఖండిస్తూ.. భవ్యశ్రీ కుటుంబాన్ని కీ న్యాయం జరిపించాలని భారత్ సమాజ్ డెవలప్ పార్టీ తరపున ఆమె డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.