ఆలయ నిర్మాణానికి భూమి పూజ
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్/ శుక్రవారం కోటగిరి మండల కల్లూర్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న బీరప్ప ఆలయ నిర్మాణం కొరకు 12లక్షల రూపాయలు మంజూరైన సందర్భంగా ఆలయ నిర్మాణం కొరకు భూమి పూజ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తమ చేతుల మీదుగా భూమిపూజ చేసిన తెరాస పార్టీ నాయకులు శ్రీ పోచారం సురేందర్ రెడ్డి ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి కుర్మ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ,మండల TRS పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కూర్మ సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు.