ఏపీ వైసీపీలో భారీ మార్పులు
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: సుబ్బారెడ్డి ముందుంటారు అని చెబుతారు. అంతే కాదు ఆయన జగన్ కి స్వయాన సొంత బాబాయ్. అందువల్ల అధినాయకత్వం దగ్గర ఆయనకు డైరెక్ట్ గా అటాచ్మెంట్ ఉంది. అందువల్ల సజ్జల కంటే వైవీ సుబ్బారెడ్డిని ముందు పెడితే అటు పార్టీ నాయకులు సైతం ఆయనతో అటాచ్ అవుతారని అలాగే వారి నుంచి వచ్చే సమస్యలు ఏవైనా జగన్ కి పూర్తిగా నేరుగా తెలిసే అవకాశం ఉంది అని అంటున్నారు.మొత్తానికి సజ్జల మధ్యలో ఉండడం వల్ల ఇటు ఉద్యోగ వర్గాలు అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు ఇంకో వైపు పార్టీ జనాలకు అధినాయకత్వానికి మధ్యన దూరం పెరిగింది అని అంటున్నారు. సో వైవీ సుబ్బారెడ్డిని సజ్జల ప్లేస్ లోకి తీసుకువస్తే పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే అని భావించే వారే ఎక్కువగా ఉన్నారట.