కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రిసీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సమక్షంలో ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. షబ్బీర్ అలీ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామంతో బీఆర్ఎస్ కేడర్ అయోమయంలో పడిపోయింది. 4వ వార్డు కౌన్సిలర్ పిడుగు మమత సాయిబాబా, 29వ వార్డు కౌన్సిలర్ అస్మా అమ్రీన్ అంజద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్యారంటీ పథకాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కౌన్సిలర్లు తెలిపారు. మరికొంత మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.