ఎన్నికల ప్రచారంలో బిర్కూర్ తెరాస నాయకులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ,ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలానికి చెందిన తెరాస నాయకులు మునుగోడు నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని చిన్న కొండూరు గ్రామం రెండవ వార్డులో గడపగడపకు తిరుగుతూ తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థి కుసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని ఓటర్ దేవుళ్లను తమదైన శైలిలో వేడుకున్నారు. ఈ ప్రచారంలో , తెరాస యువజన విభజన విభాగం మండల అధ్యక్షుడు మియాపురం శశికాంత్, బీర్కూర్ ఎంపీటీసీ సందీప్ పాటిల్ ,యువజన విభాగం నాయకులు హైమద్ సాయి ,తెరాస కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.