తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకు బీజేపీ శ్రీకారం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఆగస్టు నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రలు చేయాలని కాషాయనేతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. సిర్పూర్ హనుమాన్ దేవాలయం నుంచి కిషన్రెడ్డి పాదయాత్ర చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈయన పాదయాత్ర కొనసాగనుంది. కొండగట్టు నుంచి ఈటల పాదయాత్రను ప్రారంభిస్తారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఈటల యాత్ర సాగనుంది. భద్రాచలం నుంచి బండి సంజయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బండి పాదయాత్ర సాగనుంది