వర్ని మండల కేంద్రంలో బీజేపీ ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో వర్ని మండల కేంద్రంలో ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ఉద్యమ కెరటం డైనమిక్ ప్రజా నాయకుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలని మా ఉద్దేశం తప్ప ఎవరినో తిట్టాలని కాదు , మేము స్వచ్చందంగా కార్నర్ మీటింగ్ పెట్టుకుంటే trs పార్టీ వాళ్లు ఎందుకు భయపడుతున్నారు, వాళ్లకు బీజేపీ జెండా కనిపిస్తే చాలు భయపడుతున్నారు ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఒడిపోతామని తెలిసి మన బీజేపీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు,బిడ్డ కేసీఆర్ రేపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు నీకు ని కొడుకుని ని అల్లుడిని తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొడుతాం బిడ్డ,అని అన్నారు,ఈ కార్యక్రమంలో బాన్సువాడ బీజేపీ ఇంచార్జి మాల్యాద్రి రెడ్డి,,, సర్పంచ్ బుజ్జి అన్న గారు ,కోటగిరి అధ్యక్షుడు శ్రీనివాస్,, బాన్సువాడ కన్వీనర్ సీనియర్ నాయకుడు కొత్త కొండ, బాస్కర్,,లక్ష్మినారాయణ, నసురుళ్లబాద్ , అన్ని మండలాల అద్యక్షులు ,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.