తెలంగాణలో బిజెపి సింగిల్ గానే పోటీ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో వణుకు మొదలైంది. వచ్చే ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తోంది. గతంలో చేసిన తప్పులను మరోసారి చేయొద్దని డిసైడ్ అయింది. ముఖ్యంగా పొత్తుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటోంది. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజన లేదని భావిస్తోంది. అందుకే  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్ఫష్టం చేశారు.  అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తోందని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉంది. తెలంగాణలోనూ అదే జరుగుతుందా? అన్న వార్తలపై బండి క్లారిటీ ఇవ్వడంతో బీజేపీలో ఆసక్తి చర్చ సాగుతోంది.తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రస్తుతం బీజేపీనేనని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ప్రజలు కమలం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఇలా మాపై నమ్మకం ఉంచిన వారిని వమ్మ చేయమన్నట్లు మాట్లాడారు. అయితే గత కొంతకాలంగా బీజేపీ జనసేనల మధ్య పొత్తు ఉంటుందన్న వార్తలు వచ్చాయి.ఏపీలో ఉన్న లాగే తెలంగాణలో కూడా రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని అనుకున్నారు. దీంతో బీజేపీ నాయకుల్లో చర్చలు మొదలయ్యాయి. మరోవైపు షర్మిల పార్టీ కూడా బీజేపీ తో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరిగింది. అటు బీఆర్ఎస్ నాయకులు సైతం ఆ పార్టీలన్నీ ఒక్కటే అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల్లో అయోమయం నెలకొంది. కొందరు బీజేపీ ఎదుగుదలకు శాయశక్తులగా కృషి చేస్తున్నారు. మళ్లీ పొత్తు మాటెత్తితో తాము ఇన్నాళ్లు పడ్డ కష్టం అంతా వృథా అవుతుందని భావించారు. ఈ పరిస్థితిని ముందే గమనించిన బండి సంజయ్ పొత్తులపై వస్తున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోదని సింగిల్ గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ ఎదుగుదల చూసి కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వీటిని ఎవరూ నమ్మొద్దని పార్టీ నాయకులకు సూచించారు.ప్రతీ ఎన్నికల్లో ప్రజల్లు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తారని బండి సంజయ్ అన్నారు. 1999లో చంద్రబాబు 2004లో కాంగ్రెస్ 2014లో  ప్రజలు ఇలా ప్రత్యామ్నా పార్టీల వైపు చూసి వాటిని గెలిపించుకున్నారన్నారు. ఇప్పుడు అదే విధంగా తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ప్రజల స్థితిగతులు మారుతాయని ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలకు చెక్ పెడుతామని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.