మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన బిజెపి రాష్ట్ర నేత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్‌ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు సుదగాని హరిశంకర్ గౌడ్, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ పల్లెపాటి సత్యనారాయణ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Leave A Reply

Your email address will not be published.