ఉప ఎన్నిక రద్దుకు బీజేపీ కుట్ర పన్నుతుంది

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అర్ధరాత్రి ధర్నాలతో మునుగోడు ఉప ఎన్నిక రద్దు చేయించేందుకు బీ జె పి నాయకుల కుట్ర పన్నుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం జరుగుందని, మునుగోడులో ఓడిపోతామనే భయంతో ఘర్షణ లను సృష్టిస్తున్న బి జె పి అందులో భాగమే మొన్న పలివేలలో టీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ తో సహా టీఆరెస్ కార్యకర్తలపై బీజెపి గుండాగిరి చేసింది, అంకిరెడ్డిపాలెంలో జనం, విలేకర్లపై అసభ్య పదజాలంతో దూషణ, దాడులకు తెగబడ్డ బీజేపీ ఎన్నికల నిబంధనలకు విరుధంగా మునుగోడులో బీజేపీ నేతలు ధర్నాల పేరుతో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. ఎన్నికల కమిషన్, కేంద్ర పరిశీలకులు ఎందుకు మౌనంగా ఉన్నారు, తక్షణమే బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయించాలి ఎట్టి పరిస్థితుల్లో ఈసీ మునుగోడు ఉప ఎన్నిక శాంతి యుతంగా జరిపించాలని కూనంనేని డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.