ఊడిపోయిన బస్సు ఫుట్ బోర్డు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ ఆర్టీసీ డిపో కు చెందిన బస్సు బాన్సువాడ నుండి నిజామాబాద్ కు బయలుదేరింది. మార్గమధ్యంలో నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు బస్సు ఆగగా ప్రయాణికులు ఎక్కే సమయంలో అకస్మాత్తుగా బస్సు ఫుట్ బోర్డ్ అమాంతం కింద పడడంతో తృటిలో ప్రమాదం తప్పింది. బాన్సువాడ డిపోకు చెందిన ap 29 z 0713 నెంబర్ గల బస్సు ప్రయాణికులు ఎక్కే ముందు ఫుట్ బోర్డు కుప్పకూలి కింద పడిపోవడంతో అప్రమత్తమైన ప్రయాణికులు దూరంగా వెళ్లిపోయారు. కాలం చెల్లిన బస్సులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్టీసీ యాజమాన్యం పై పలువురు మండల ప్రజలు అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బస్సులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులోకి ఎక్కించి వారి గమ్యస్థానాలకు చేర్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.