ఫెవిపిరావిర్ వినియోగం తో నీలి రంగులోకి మారిన పసికందు కళ్లు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కరోనా వైరస్కు చికిత్స తీసుకున్న ఓ పసికందు కళ్లు అసాధారణ రీతిలో ముదురు నీలి రంగులోకి మారాయి. ఈ ఘటన థాయ్లాండ్ లో వెలుగులోకి వచ్చింది. మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ ప్రకారం..ఆరు నెలల పసికందుకు జ్వరం, దగ్గు రావడంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. దీంతో ఆ చిన్నారికి కొవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో పసికందుకు మూడు రోజుల పాటు ఫెవిపిరావిర్తో చికిత్స అందించారు. ఆ ఔషధం వాడిన తర్వాత చిన్నారి ఆరోగ్యం మెరుగైంది. అయితే, ఆ మందు వాడిన 18 గంటల తర్వాత చిన్నారి కళ్ల రంగులో మార్పు కనిపించింది. చిన్నారి కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి ప్రకాశవంతమైన నీలి రంగులోకి మారాయి. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఫెవిపిరావిర్ మందు వినియోగం తక్షణమే నిలిపివేయమని సూచించారు. ఆ తర్వాత ఐదు రోజులకు పసికందు కళ్లు సాధారణ స్థితికి చేరుకున్నాయి.‘కళ్లు మినహా చర్మం, గోళ్లు, నోరు, ముక్కు వంటి ప్రాంతాల్లో ఎటువంటి రంగు మార్పు కనిపించలేదు. ఫెవిపిరావిర్ వినియోగం మొదలెట్టిన మూడో రోజుకు శిశువు ఆరోగ్యం మెరుగుపడింది. అయితే, కళ్ల రంగు మార్పు కారణంగా ఆ మందు వాడొద్దని వైద్యులు సూచించారు. మందు నిలిపివేసిన ఐదో రోజుకు కళ్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి’ అని జర్నల్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.కాగా, చిన్నారులకు కొవిడ్ ట్రీట్మెంట్గా ఫెవిపిరావిర్ను థాయ్ల్యాండ్ ప్రభుత్వం 2022లో అనుమతించింది. ఓ మోస్తరు వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు వాడాలని సూచించింది.