ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ భాష్యం విజయ సారథి మృతికి బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ భాష్యం విజయ సారథి మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. సంస్కృత భాష విస్తృతంగా ప్రజలు తీసుకొని వెళ్లి సంస్కృత భాష అభివృద్ధి కోసం విజయ సారథి ఎనలేని కృషి చేశారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వివిధ విద్యా సంస్థల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించిన మహా వ్యక్తి విజయ సారథి కరీంనగర్ లోని యజ్ఞ వరహా స్వామి ఆలయ ట్రస్టీగా విశేష కృషి జరిపిన గొప్ప వ్యక్తి విజయ సారథి శ్రీ భాష్యం విజయసారథి మృతి రాష్ట్రానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను మనోధర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

Leave A Reply

Your email address will not be published.