చార్మినార్ కు బాంబు బెదిరింపు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన చార్మినార్ వద్ద బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో వెంటనే ఆప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్వ్కాడ్‌లను రంగంలోకి దింపి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. చార్మినార్ వద్ద బాంబ్ స్వ్కాడ్ దాదాపు గంట నుండి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా.. చార్మినార్ పరిసర ప్రాంతాలోని ఫుట్ పాత్‌లపై ఉన్న షాపులను పోలీసులు తొలగించారు. చార్మినార్ వద్ద బాంబ్ పెట్టారన్న సమాచారం తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.