వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గ్రామ సింహాలైన కుక్కలు చిన్న పిల్లలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయగా ఒక బాలుడు మృతి చెందగా ఒక పసికందు తీవ్ర గాయాల పాలైంది‌‌.

ఇస్నాపూర్ లో విశాల్ అనే ఎనిమిదేళ్ల బాలునిపై కుక్కలు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఇస్నాపూర్ లోని మహీదర వెంచర్ లో బీహార్ కు చెందిన విశాల్ తల్లి దండ్రులు లేబర్ క్యాంపులో ఉంటూ నివాసం ఉంటున్నారు. విశాల్ కాలకృత్యాల కోసం వెళ్లగా ఒక్క సారిగా కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ముత్తంగిలో స్వాతి అనే ఏడు నెలల పసికందుపై కుక్క దాడి చేసి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.