యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రేక్‌ దర్శన సదుపాయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రేక్‌ దర్శన సదుపాయం అమలులోకి వచ్చింది. తొలి రోజు 117 మంది భక్తులు బ్రేక్‌ దర్శనంలో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారంగుండా స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి స్వయంభూను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.ఐదు నిమిషాల్లోనే స్వామివారి దర్శనభాగ్యం కలిగిందని తెలిపారు. బ్రేక్‌ దర్శనంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి హారతి ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలు కొనసాగాయి. తిరుమల తరహాలో బ్రేక్‌ నర్సన్న సన్నిధిలోనూ బ్రేక్‌ దర్శనం సదుపాయం కల్పించగా.. వీఐపీ, వీవీఐపీ భక్తులకు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫారసులపై వచ్చే భక్తులకు రూ.300 టికెట్‌పై బ్రేక్ దర్శనం కల్పించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.