నిజాంసాగర్ లో యువకుడిని చంపేసిన సోదరులు, తల్లి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: నిజాంసాగర్ మండలం వడ్డేపల్లిలో తల్లి, సోదరుల చేతిలో యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం ప్రకారం కుంటోళ్ల శేఖర్ ను అతని తల్లి కిష్టవ్వ, అన్న రాజు, తమ్ముడు ఈశ్వర్లు హత్య చేశారు. ఇటీవల గుడిలో చోరీ చేయడంతో గ్రామస్తులు రూ. 15 వేల జరిమానా విధించారు. చోరీ చేసి కుటుంబ పరువు తీస్తున్నాడని శేఖర్ను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.