బీఆర్ఎస్ పార్టీ, మ‌జ్లిస్ పార్టీ క‌లిసి 29 సీట్ల‌కు 29 మేమే గెల‌వ‌బోతున్నాం

-  స్ప‌ష్టం చేసిన  ముఖ్య‌మంత్రి కేసీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ, మ‌జ్లిస్ పార్టీ క‌లిసి పాత రంగారెడ్డి జిల్లా, హైద‌రాబాద్‌లో 29 సీట్ల‌కు 29 మేమే గెల‌వ‌బోతున్నాం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎటువంటి అర‌మ‌రిక‌లు లేవు అని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసిన అనంత‌రం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.మ‌జ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు చెట్టాప‌ట్టాలేసుకుని ఫ్రెండ్లీ పార్టీగానే ఉన్నాం అని కేసీఆర్ తెలిపారు. మొద‌ట్నుంచి కూడా 2014 నుంచి ఉన్నాం. ఇప్పుడు కూడా మా మ‌ధ్య స్నేహితం అదే విధంగా కొన‌సాగుతోంది. అదే విధంగా మిత్ర‌ప‌క్షాలుగా పోటీ చేస్తా ఉన్నాం. ఆ విధంగా మంచి అండ‌ర్ స్టాండింగ్‌తో ముందుకు పోతున్నాం. ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా దీవిస్తార‌నే విశ్వాసం ఉంది.నాకెలాంటి సందేహం లేదు.. మేం, మ‌జ్లిస్ క‌లిసి పాత రంగారెడ్డి జిల్లా, హైద‌రాబాద్‌లో 29 సీట్ల‌కు 29 మేమే గెల‌వ‌బోతున్నాం. అందులో అనుమాన‌మే లేదు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు

Leave A Reply

Your email address will not be published.