కాంగ్రెస్ పోస్టర్లు సైతం పెట్టకుండా బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది

-వి.హనుమంతరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ పై బిఆర్ ఎస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ పార్లమెంట్ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పోస్టర్లు సైతం పెట్టకుండా బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని, మెట్రో పిల్లర్స్ అన్ని బీఆర్ఎస్, బీజేపీ కొనేశారని ఎన్. వి.ఎస్.ఎస్ రెడ్డి చెప్తున్నారన్నారు. కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీనే అనే అంశాన్ని మెట్రోయం.డి కి గుర్తుచేశారు. ఆంధ్రాలో నష్టపోతామని తెలిసి కూడా సోనియా తెలంగాణ ఇచ్చారు. కానీ సోనియాగాంధీ బొమ్మ కనిపిస్తే మార్పు వస్తుందన్న భయంతో కాంగ్రెస్ పోస్టర్లకు ఒక్క పిల్లర్ కూడా లేకుండా చేశారన్నారు. అవకాశం ఉన్నంతవరకు పోస్టర్లు వేయాలని కాంగ్రెస్ శ్రేణులకు హనుమంతరావు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.