సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన బస్.. ఏడుగురు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎంతో వైభవంగా పెళ్లి జరిగి  ఆనందోత్సాహాల నడుమ బంధుమిత్రులందరితో కలిసి ఓ బస్సులో వివాహ రిసెప్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. అనుకోని ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ బస్సు ఎదురుగా రావడంతో సైడ్ ఉన్న కాంక్రీట్ దిమ్మెను ఢీకొట్టిన బస్సు.. ఆపై అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి.. చిమ్మ చీకటి.. ఏం జరుగుతోందో తెలియదు. అంతా నిద్రమత్తులో ఉన్నారు. సాగర్ కాలువలో బస్సు పడటంతో ఒకరిపై మరొకరు పడిపోయారు. ఊపిరి ఆడలేదు. అంతే ఏడేళ్ల చిన్నారిఐదుగురు మహిళలు సహా మొత్తంగా ఏడుగురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.దర్శిలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి సాగర్ కాలువలోకి పెళ్లి బస్సు దూసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో పద్దెనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలుఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. పొదిలి నుంచి కాకినాడలో వివాహ రిసెప్షన్ కి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిపి 47 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.రాత్రి 12:50 కు ఎదురుగా మరో బస్సు రావటంతో సైడ్ ఉన్న కాంక్రీట్ దిమ్మెను ఢీ కొట్టడంతో అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. బస్సులో ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు.18 మందికి గాయాలు అయ్యాయి. సాగర్ కాలువలో పడిన బస్సును బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. సీరియస్‌గా ఉన్న నలుగురిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీస్,ఫైర్ సిబ్బంది స్పందించి సహాయక చర్యలలో పాల్గొన్నారు. బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గార్గ్ పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.