తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కొత్తేమి కాదని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఈ సంస్కృతిని అనుసరించిందన్నారు. తెలంగాణలో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని ఇరు పార్టీలు చేసిన అరాచకాలు తెలియదా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ను అపహస్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.