వైసీపీ పేటీఎం బ్యాచ్ బరితెగింపు..చంద్ర బాబు ఆగ్రహం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దౌర్జన్యాలు, అరాచకాలతో కొనసాగుతున్న వైసీపీ పాలనను విపక్ష టీడీపీ ఎండగడుతుండడం పాలక పక్షానికి రుచించడం లేదు. సీఎం జగన్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతల విమర్శలను వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. జనాల్లో వైసీపీ వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతుండడంతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికగా వైసీపీ సోషల్ మీడియా కేటుగాళ్లు తమకే సాధ్యమైన కుయుక్తులు పన్నుతున్నారు. పేటీఎం బ్యాచ్ కంత్రిగాళ్లు ఫేక్ వీడియోలను రూపొందించి వాటిని సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో వదులుతున్నారు. ఇటివల చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ప్రసంగాన్ని సైతం ఇందుకోసం ఉపయోగించుకున్నారు.చంద్రబాబు తూర్పుగోదావరి సభలో మాట్లాడిన మాటలను అత్యంత దారుణంగా ఎడిటింగ్ చేసిన వైసీసీ సోషల్ మీడియా కేటుగాళ్లు వాటిని ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వదిలిపెట్టారు. అనపర్తి సభలో చంద్రబాబు ముందుగా మాట్లాడిన మాటలను చివరకు… చివరిలో మాట్లాడిన మాటలను మొదటికి అతికించి వీడియోలను ఎడిటింగ్ చేశారు. ఆ వీడియోల ద్వారా అమాయక జనాలను ఏమార్చే ప్రయత్నం చేశారు. ఈ ఫేక్ వీడియోలను తమ పేటీఎం బ్యాచ్ ద్వారా షేర్లు, లైక్‌లు చేయిస్తున్నారు. అందుకోసం హైసెక్యూరిటీని కూడా వాడేందుకు వెనుకడుగువేయడం లేదు. వీడియోలను ఎవరూ డౌన్‌లోడ్ చేయకుండా ప్రత్యేక యాప్‌లను వైసీపీ బ్యాచ్ వాడుతోంది. పైగా వీడియోలకు టాలీవుడ్ యువహీరో సిద్ధు జొన్నలగడ్డ ఫొటోలను వైసీపీ కంత్రిగాళ్లు వాడుతుండడం కొసమెరుపు.

Leave A Reply

Your email address will not be published.