రాష్ట్రమంతట నగదు బదిలీ చేయాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ బదులుగా నగదు బదిలీ అమలు చేసేందుకు నిర్ణయించగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరికీ నగదు బదిలీ పథకం అమలు చేయాలని కోరుతూ బీర్కూరు మండల తాసిల్దార్ రాజుకు శనివారం వినతిపత్రం అందజేశారు.. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా గొర్రె మేకల పెంపకం దారుల సహకార సంఘం డైరెక్టర్ పరువు గొండ, బాన్సువాడ డివిజన్ యూత్ అధ్యక్షులు జల్దవారు రమేష్ , బీర్కూరు మండల అధ్యక్షులు పీరుగొండ, మండల యూత్ అధ్యక్షులు పీరయ్య, కార్యదర్శి గంగాధర్, సాయిలు కుర్మా సంఘం సభ్యులు శ్రీను, సాయిగొండ, హన్ముగొండ, బీరుగొండ, ప్రవీణ్, రవి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.