సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తూ నన్ను ఇరికిస్తోంది

- అవినాష్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వివేకా కేసులో సునీతమ్మ మొదట సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్‌లలో చాలా వ్యత్యాసం ఉంది. సునీతక్క సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పలు అనుమానాలున్నాయి. సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తూ నన్ను కుట్ర పూరితంగా ఇరికిస్తోంది. వివేకా హత్య కేసును ఛేదించే దానికంటే నన్ను ఇరికించే దానికే సీబీఐ ప్రయత్నిస్తోంది. నేను రెండేళ్లుగా సీరియస్‌గా తీసుకోకపోవడమే ఇలా జరిగిందనీ భావిస్తున్నాను. ఒక ఎంపీ స్థాయి వ్యక్తికే ఇన్ని ఇబ్బందులు వస్తే.. సామాన్యుడి పరిస్దితి ఏమిటి..?. వివేక హత్య జరిగిన రోజు నేను జమ్మలమడుగు వెళ్తుతున్నాను. పులివెందుల రింగ్ రోడ్డుకు వెళ్ళిన తర్వాత శివప్రకాష్ రెడ్డి నుంచి నాకు ఫోన్ వచ్చింది. కానీ నేను ఆ రోజు ఇంట్లోనే ఉన్నట్లు చూపించి కేసులో ఇరికించే ప్రయత్నం చేసింది. నాతో పాటు ఆ రోజు జమ్మలమడుగుకు 20 మంది పైనే వస్తున్నారు. నా వెనుక వచ్చిన వారిని సీబీఐ ప్రశ్నంచినా విషయం బయట పడుతుంది. హత్య జరిగిన రోజు విలువైన పత్రాలు ఎత్తుకెళ్ళామని దస్తగిరి చెబుతున్నాడు.. కానీ దానిపై ఎందుకు చోరీ కేసు సెక్షన్లు పెట్టలేదు ఆవిధంగా ఎందుకు విచారించడం లేదు. లెటరుసెల్ ఫోన్ సాయంత్రం వరకు ఎందుకు దాచి పెట్టారు..ఆ కోణంలో వారిని ఎందుకు ప్రశ్నించరు..దర్యాప్తు చేయరు..?. ఈ కేసులో నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఈ కేసులో విషయంలో నేను ఏ తప్పు చేయలేదని చాలా ధీమాతో ఉన్నాను’ అని అవినాష్ ఈసారి కొత్త లాజిక్‌లుకొత్త కోణాలను బయటపెట్టారు.ఇప్పటి వరకూ ఈ కేసులో పలు విషయాలు చెప్పిన అవినాష్.. ఇప్పుడు కొత్త కోణాల గురించి చెప్పడం పలు అనుమానాలు తావిస్తోంది. రెండ్రోజులుగా సీబీఐ బృందం పులివెందులలోనే తిష్టవేసి ఈ కేసుకు సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తోంది. మరోవైపు రేపో.. మాపో అవినాష్‌ను అరెస్ట్ చేస్తారని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.