కడప ఎంపీ అవినాష్రెడ్డి కి సీబీఐ మరోసారి నోటీసులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కడప ఎంపీ అవినాష్రెడ్డి కి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకుహైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డిని సీబీఐ ప్రశ్నించనుంది. మొదట ఈనెల 24వ తేదీన విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా తాను రాలేనని, 5 రోజుల తర్వాత విచారణకు హాజరవుతానంటూ అవినాష్రెడ్డి లేఖ రాశారు. ఎంపీ లేఖపై స్పందించిన సీబీఐ ఈ మేరకు మరోసారి నోటీసులు ఇచ్చింది.