తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో పెద్దఎత్తున బియ్యం కుంభకోణం జరుగుతోందని టీడీపీ నేత పట్టాభి (అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… పేదోడి బియ్యాన్ని కూడా జగన్రెడ్డి బకాసురులు దోచేస్తున్నారని మండిపడ్డారు. పంట దిగుబడులు పెరగకున్నా బియ్యం ఎగుమతులు పెరగడమేంటని ప్రశ్నించారు. బియ్యం మాఫియాలో వాటాల తేడాలతోనే తెనాలిలో హత్యలు జరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని పేదలకు పంచకుండా వైసీపీ నేతలు అడ్డదారుల్లో విదేశాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బియ్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టాభి డిమాండ్ చేశారు.