11న కవితను ప్రశ్నించనున్న సీబీఐ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఈ నెల 6న సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్  7వ తేదీ జగిత్యాలలో పర్యటిస్తుండడంతో, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నందున తాను విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకి సమాచారం పంపారు. 11, 12, 14, 15వ తేదీల్లో ఏ రోజైనా విచారణకు హాజరవుతానని సీబీఐకి మెయిల్ చేశారు. 11వ తేదీన విచారణకు వస్తామని సీబీఐ కవితకు సమాచారం పంపింది.

Leave A Reply

Your email address will not be published.