గ్రామాల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు

తెలంగాణ జ్యోతి/కామారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చుతూ భారత రాష్ట్ర సమితి గా పేరు మార్చుతూ బుధవారం తెలంగాణ భవన్ లో సంతకాలు చేయడంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గ్రామ గ్రామాన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ, జై భారత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలు గ్రామాల్లో వెల్కం టు బీఆర్ఎస్ అని ఏర్పాటు చేసిన కేకులను కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.