అందుల శరణాలయాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం అందుల శరణాలయాలకు ప్రత్యేక సదుపాయాలు ఇచ్చి ఆదరించి ప్రోత్సహించాలని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ బిజెపి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ శ్రీజి వివేక్ గారిని రాజ్ భవన్ సమీపానగల వారి స్వగృహంలో కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ అంద శరణాలయ నిర్వహకుడు వందనం రాజు అంద విద్యార్థుల సంక్షేమం గురించి అంద విద్యార్థుల శరణాలయాల ఇబ్బందుల గురించి వివరించారు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అంద విద్యార్థులకు శరణాలయాలకు మరింత చేయూతను ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరారు అంబేద్కర్ యువసేన అధ్యక్షుడు మల్లు శివరాం ఆధ్వర్యంలో జి వివేక్ గారికి వినతిపత్రం సమర్పించారు కార్యక్రమంలో సంఘ సేవకులు విజయ దేవి అంబేద్కర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు