కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో ఇటీవల ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రాన్ని బాన్సువాడ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ నెర్రె నర్సింలు, మరియు రైతుబంధు సమితి మండల డైరెక్టర్ పట్లోళ్ల దేవేందర్ రెడ్డితో కలిసి సందర్శించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు తెలియజేశారు. ఎలాంటి ఇబ్బంది ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల డైరెక్టర్ పెద్దపట్లోళ్ల దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యురాలు పుట్టి విజయ, ఉప సర్పంచ్ మంద శ్రీనివాస్, మండల టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, పార్టీ అధ్యక్షులు గోపనపల్లి సాయిలు, వార్డు సభ్యులు నాగభూషణం, ఆనంద్, ఇంద్రసేనారెడ్డి, పాపిరెడ్డి, కురుమ సంఘం ప్రెసిడెంట్ రాజు, దడ్గి హైమద్, గాండ్ల పెద్ద సాయిలు, శాదుల్లా సార్, గోపాల్ సార్, గంగాధర్, సూరంపల్లి సాయిరెడ్డి, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.