ఎన్నికలలో డబ్బులు పంచడం నేర్పిన వ్యక్తి చంద్రబాబు       

- మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై నోరుపారేసుకున్నారు. ఎన్నికలలో డబ్బులు పంచడం నేర్పిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. 1999 లోనే ఒక్కో అభ్యర్ధికి కోటి చొప్పున ఇచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత ఎన్నికలలో వరసగా 5, 10, 20, 30 కోట్ల రూపాయలు చొప్పున అభ్యర్థులకు ఇచ్చారన్నారు. పదివేల కోట్ల రూపాయలు తన పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు ఇచ్చాడనేది వాస్తవమన్నారు. ఈ డబ్బు అంతా చంద్రబాబుకు ఎలా వచ్చిందంటే కమీషన్లు తీసుకోబట్టే కదా అని అన్నారు. ఇప్పుడు ఐటీ నోటీసులు ఇచ్చిన 118 కోట్లు అనేది చాలా తక్కువ మొత్తమన్నారు. ఇది రికార్డుగా దొరికిన డబ్బు మాత్రమే అని.. లక్ష కోట్లు వరకు దోచుకున్నారని ఆరోపించారు. హెరిటేజ్ ద్వారా ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చంద్రబాబు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.