వైసీపీ మంత్రులపై విరుచుక పడ్డ చంద్రబాబు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైసీపీ మంత్రులపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ‘‘ఉదయం లేచింది మొదలు నన్ను తిట్టడమే మంత్రులకు పెద్దపని. అక్రమ మైనింగ్ చేసేవాడు మైనింగ్ మంత్రి. సొంతూళ్లో పిల్ల కాల్వ తవ్వలేని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి. నియోజకవర్గంలో 10 ఇళ్లు కట్టలేని వాడు హౌసింగ్ మంత్రి. పెట్టుబడులు అడిగితే కోడిగుడ్డు గురించి చెప్పేవాడు పరిశ్రమల మంత్రి. సీఎం జగన్‌ కు అనుకూల తీర్పులు రావాలని యాగాలు చేసేవాడు దేవాదాయ మంత్రి. రైతు బజార్లను తాకట్టు పెట్టేవాడు ఆర్థిక శాఖ మంత్రి. పిల్లల జీవితాలు నాశనం చేసేవాడు విద్యా మంత్రి’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.

అమరావతి ఎక్కడికీ పోదు

అమరావతి ఎక్కడికీ పోదని, 9 నెలల తర్వాత మళ్లీ నిర్మాణ పనులు పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరాన్ని కట్టాలని సంకల్పించామన్నారు. అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. టీడీపీపై విశ్వాసంతోనే 29 వేల మంది రైతులు భూములిచ్చారని, టీడీపీ (TDP) వచ్చాక అమరావతిలో పనులు పరుగులు పెట్టిస్తామని ప్రకటించారు. గతంలో శంకుస్థాపన చేసిన వాటికే మళ్లీ చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు.

Leave A Reply

Your email address will not be published.