మహానాడుకు టిడిపి శ్రేణులకు స్వాగతం పలికిన చంద్రబాబు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరం వేదికగా తలపెట్టిన మహానాడు-2023కు సర్వంసిద్ధమైంది. ఈ మేరకు ‘మహానాడు పార్టీ ప్రతినిధుల సభకు ఆహ్వానము’ పేరిట పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానాలు పంపిస్తున్నారు. తన డిజిటల్ సైన్‌‌తో ఉన్న ఆహ్వాన పత్రికలతో పార్టీ కేడర్‌ను ఆహ్వానిస్తున్నారు.అమరావతి/రాజమహేంద్రవరం: ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు కదనోత్సాహంతో ‘మహానాడు 2023’కు తెలుగుదేశం పార్టీ (సిద్ధమైంది. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో ఈనెల 27, 28 తేదీల్లో తలపెట్టిన ఈ పసుపు శ్రేణుల పండగకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొదటి రోజున ప్రతినిధుల సభ, రెండో రోజున ఎన్టీఆర్ జయంతి, బహిరంగ సభ జరగనున్నాయి. ఈ మేరకు ‘మహానాడు పార్టీ ప్రతినిధుల సభకు ఆహ్వానము’ పేరిట పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానాలు పంపిస్తున్నారు. తన డిజిటల్ సైన్‌‌తో ఉన్న ఆహ్వాన పత్రికలతో పార్టీ కేడర్‌ను ఆహ్వానిస్తున్నారు.

లేఖలో ఏముందంటే….

‘‘ తెలుగుజాతి ఔన్నత్యాన్ని, ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు నాంది పలికిన యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాలను మహానాడు వేదికగా మరింత ఘనంగా జరుపుకుంటుంది తెలుగుదేశం. అలానే అన్నగారి జయంతి సందర్భంగా ప్రతి యేటా పార్టీ ప్రతినిధుల మహానాడును మే 27న జరుపుకోవడం మన సంప్రదాయం. రాజమహేంద్రవరం (వేమగిరి)లో నిర్వహిస్తున్న మహానాడులో రాజకీయ, సాంఘీక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై మరియు ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక విధానాలపై చర్చ జరుగుతుంది. మే 28న భారీ బహిరంగ సభకు జరుగుతుంది. ఈ మహానాడులో మీరందరూ భాగస్వాములు కావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాను… అభినందనలతో మీ నారా చంద్రబాబు నాయుడు’’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి….

టీడీపీ మహానాడుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేదికైన వేమగిరి, రాజమహేంద్రవరం ప్రాంతాలో ముస్తాబయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఇప్పటికే పసుపు వర్ణమయ్యింది. మరోవైపు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతమంది వచ్చినా అందుకు తగ్గట్టుగా పార్టీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా భోజనాల కోసం పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ మహానాడులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డీజీపీకి బుధవారం విజ్ఞప్తి చేశారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు లక్షలాదిగా మహానాడుకు రానున్నందున వారికి రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ ఎండీని కోరారు. ఈ మేరకు బుధవారం డీజీపీ, ఆర్టీసీ ఎండీలకు వేర్వేరు లేఖలు రాశారు.

Leave A Reply

Your email address will not be published.