ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ వైఫల్యాలపై చార్జ్షీట్

- రేవంత్రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాని మోదీసీఎం కేసీఆర్ వైఫల్యాలపై చార్జ్షీట్ విడుదల చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. నిపుణులు సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిద్దామన్నారు. తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందన్నారు. నిరంకుశ పరిస్థితుల నుంచి విముక్తి కల్పించేది కాంగ్రెస్ మాత్రమేనని.. బండ్లతోనిగుండ్లతోని అయ్యేది ఏం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఓటరు జాబితాలో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. ధరణితో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా అందించారన్నారు. ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ జోడో యాత్ర చేస్తున్నారని కొనియాడారు. జనవరి 26న జెండా ఎగరేయడంతో బాధ్యత తీరలేదన్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రతి గడపకు రాహుల్గాంధీ సందేశాన్ని చేరవేస్తామని రేవంత్రెడ్డి ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.