ఆర్యవైశ్య సంఘం రాజకీయ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిదుర సచిన్ గుప్తా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ రాజకీయ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిదుర సచిన్ గుప్తా ని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పాత బాలకృష్ణ గుప్తా సోమవారం నియామకం చేయడం జరిగింది. అనంతరం సచిన్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు ఈ పదవి కట్టబెట్టినందుకు జిల్లా కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగరాజు, బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు కాసం శ్రీనివాస్ గుప్తా ,మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాగులుగమ మురళీకృష్ణ ,సంగమేశ్వర్ గుప్తా,పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గంప బాలకృష్ణ గుప్తా , పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్రంగి గంగాధర్, పట్టణ కోశాధికారి శివ గుప్తా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.