బిగ్ ట్రబుల్స్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఒకే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇద్దరు ముఖ్యమంత్రులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇద్దరూ బిగ్ ట్రబుల్స్ లో పడ్డారని అంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కొరడా ఝలిపించడంతో ఏపీ తెలంగాణాలలో అధికార పార్టీ రాజకీయాలలో కలకలం రేగుతోంది. ముందుగా తెలంగాణా అధికార పార్టీ బీయారెస్ గురించి చెప్పుకుంటే సీఎం కేసీయార్ కుమార్తె. ఎమ్మెల్సీ అయిన కవిత విషయంలో ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఆమెను విచారణకు రమ్మని ఈడీ ఆహ్వానం పంపినట్లుగా చెబుతున్నారు . కేసులో లబ్ధిదారుల్లో కవిత ఒకరని కీలక కుట్రదారు కూడా అని ఈడీ కోర్టుకు ఆధారాలు అందించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారు దీనిపై సాక్ష్యం చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అధికారులు అరెస్టు చేశారు. ఊహాగానాల ప్రకారం కవిత కూడా ఇబ్బందుల్లో పడవచ్చు అని అంటున్నారు. అదే టైం లో కవితని విచారణ పేరిట  పిలిచి అరెస్ట్ చేయవచ్చు అని కూడా టాక్ నడుస్తోంది. ఈ నెల 11న కవిత ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవుతున్నారు.ఈ విచారణ సంగతి చూస్తూ ఉంటే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాదిరిగా అరెస్ట్ చూపిస్తారు అని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం లో కవితకు ఈడీ నుంచి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బీయారెస్ అధినేతగా దేశమంతా తిరిగి సత్తా చాటాలని భావిస్తున్న కేసీయార్ కి సొంత కూతురే అరెస్ట్ అయితే  అది ప్రకంపనలు సృష్టించడం ఖాయమనే అంటున్నారు.మరో వైపు చూస్తే ఏపీలో అధికార వైసీపీకి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల కత్తి వేలాడుతోంది. ఒక వైపు ఎటూ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ జోరు పెంచింది. అది అలా సాగుతూండగానే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు ఇపుడు కొలిక్కి వస్తోంది.ఈ కేసులో ఇప్పటిదాకా రెండు సార్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిపించారు. ఆయనను మొదటిసారి నాలుగున్నర గంటల పాటు రెండోసారి ఆరు గంటల పాటు విచారించిన సీబీఐ ముచ్చటగా మూడవసారి ఈ నెల 10న విచారణకు రమ్మంటోంది. ఈసారి కచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం అయితే సాగుతోది. అదే కనుక జరిగితే మాత్రం ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వరసకు తమ్ముడు అయిన అవినాష్ రెడ్డి వ్యవహారం వైసీపీలో కలవరం రేపడం ఖాయమని అంటున్నారు. అయితే  బీజేపీతోనూ కేంద్ర ప్రభుత్వంతోనూ ఉన్న సత్సంబంధాల వల్ల  ఎలాగైనా ఈ అరెస్ట్ను అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ తెలంగాణలో బీజేపీ తన జెండా పాతడానికి చూస్తున్న నేపధ్యంలోనూ కేసీయార్ విషయంలో అయితే కవిత అరెస్ట్ తప్ప ఎలాంటి వెనక్కు తగ్గడాలూ ఉండవని అంటున్నారు.కేసీయార్ కుటుంబంపైనా ప్రభుత్వంపైనా టార్గెట్ పెట్టి  తీగ లాగితే మొత్తం డొంక అంతా కదిలించాలని బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది. దాంతో కేసీయార్ అయితే బీజేపీతో అమీ తుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతున్నందువల్ల ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇపుడు ఒకే మాదిరిగా రాజకీయాలు సాగడమే విశేషం

Leave A Reply

Your email address will not be published.