టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ కేసులో 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అధికారులు ఇచ్చిన నోటీసులను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. నారాయణ శస్త్ర చికిత్స చేయించుకున్నారని న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. హైదరాబాద్, కూకట్పల్లిలోని నారాయణ నివాసంలో ఆయనను ప్రశ్నించాలంటూ ఏపీ సీఐడీ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.