సీఎం కేసీఆర్ ముస్లింలకు చేసింది ఏమీ లేదు

- షబ్బీర్ అలీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  సీఎం కేసీఆర్ ముస్లింలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. కేసీఆర్ పాలనలో 12 శాతం రిజర్వేషన్లు అమలు జరగడం లేదన్నారు. దళితుల కన్నా ముస్లింలు వెనకబడి ఉన్నారని కమిటీలే చెప్పాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్లతోనే ముస్లింల అభివృద్ధి చెందారని, మెడికల్ కౌన్సిల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ వల్లే వచ్చాయని తెలిపారు. ఉమ్మడి ఏపీలో 2004లోనే కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిందన్నారు. మైనారిటీలకు 4 కాలేజీల్లో 560 సీట్లు ఉన్నాయని షబ్బీర్ అలీ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.