బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన సిఎం కెసిఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్‌ సంతకం చేశారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.