పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: చంద్ర‌బాబు నాయుడు పోల‌వ‌రంలో ప‌ర్య‌టిస్తున్నారు.. అనుకున్నట్టుగానే ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి పోలవరం చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి, అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్వాగ‌తం ప‌లికారు. హెలికాప్టర్‌లో అక్కడకు చేరుకున్న చంద్రబాబు నేరుగా పోలవరం సందర్శించారు. ముందుగా ఆయ‌న హెలికాప్ట‌ర్ ద్వారా పోలవ‌రం నిర్మాణాలను ఏరియ‌ల్ వ్యూ ద్వారా ప‌రిశీలించారు. అనంత‌రం స్పీల్‌వే, కాప‌ర్ డ్యామ్, డ‌యాఫ్రం వాల్ పనులను చూశారు.. ఇర మ‌ధ్యాహ్నం 2 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు ప్రాజెక్టు పురోగ‌తిపై అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

Leave A Reply

Your email address will not be published.