డిచ్ పల్లి పరిధిలో కోకైన్ నిల్వలు స్వాధీనం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లిలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. అర్ధరాత్రి వేళ డిచ్‌పల్లి పరిధిలో కొకైన్‌ నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నది. కారులో డ్రగ్స్‌ను తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. కొకైన్‌ను తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాన్ని ఆరాతీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉన్నది.

Leave A Reply

Your email address will not be published.