కమర్షియల్ అయిన రాజకీయాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం కేసీఆర్ సర్కార్పై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. 9 ఏళ్లు పూర్తైన తెలంగాణ లో దశాబ్ది ఉత్సవాలు విడ్డూరమన్నారు. ఎన్నికల కోసమే దశాబ్ది ఉత్సవాలు అని విమర్శించారు. రాజకీయాలు కమర్షియల్ అయింది వాస్తవమన్నారు. కమర్షియల్ రాజకీయాలు తాను చేయలేనన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీచేస్తానని ఉత్తమ్ తెలిపారు.