వినాయక మండపం వద్ద ముగ్గుల పోటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ వద్ద శ్రీ వెంకటేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద గణనాథునికి కాలనీ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా వినాయక మండపం వద్ద మహిళా మణులు ముగ్గుల పోటీలు మరియు కుకుమార్చన దీప ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వినాయక మండప సభ్యులు, కాలనీ మహిళలు, భక్తులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.