పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్‌ ఫిర్యాదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్‌ లో గెలిచి బీఆర్ఎస్‌ లోకి జంప్ అయిన 12 మంది ఎమ్మెల్యేలపై ఇన్నాళ్లకు తెలంగాణ పీసీసీ దృష్టి పెట్టింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రలోభాలకే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ మారిన తర్వాత పొందిన లబ్ది, ఆర్థిక పరమైన లావాదేవాలపై ఆధారాలతో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

Leave A Reply

Your email address will not be published.