అక్బరుద్దీన్ ఓవైసీ తో కాంగ్రెస్ నేతలు భేటీ

- ఎన్నికల్లో పోటి పై చర్చ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 50 నియోజకవర్గాలలో నిజంగా పోటీ చేస్తారా? అని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అడిగారు. ఖచ్చితంగా పోటీ చేస్తామని అక్బరుద్దీన్ చెప్పారు. బీజేపీ బీ టీమ్ అని ప్రచారం చేస్తున్నారని, కానీ మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. దేశం, రాష్ట్రంలో బీజేపీ చేసే అరాచకాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. బీజేపీ పూర్తిగా ఓటు బ్యాంకు పొలరైజ్ చేస్తోందని, మేము తమ వర్గానికి అండగా ఉంటామని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఇలా అయితే ఎంఐఎం చేస్తున్నదేంటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మీరు మీ వర్గానికి అంటే.. బీజేపీ ఎజెండా కూడా అదే కదా అని ప్రశ్నించారు. ఎవరు ఏమనుకున్నా.. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం మాత్రం విస్తరిస్తుందని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.