రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ ఏనాడు అనలేదు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రైతుబంధు ఆపమని కాంగ్రెస్ కోరలేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పథకాలకు సంబంధించిన నగదును ఎలక్షన్ నోటిఫికేషన్ లోపు జమ చేయమని మాత్రమే కోరామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తమ పార్టీ డిమాండ్పై గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రైతుబంధు, దళిత బంధు ఇవ్వకుండా కాలయాపన చేసిన బీఆర్ఎస్… ఇప్పుడు కాంగ్రెస్ పేరు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు భట్టి.